రాష్ట్ర ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు#HappyHoli pic.twitter.com/XBwDc0doEI — Pocharam Srinivas Reddy (@PSRTRS) March 18, 2022 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీరు ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. #HappyHoli All pic.twitter.com/Tka7RRgAcM — KTR …
Read More »కొత్త పెన్షన్లు మంజూరుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. నిన్న గురువారం సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హారీష్ రావు పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లాలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ వచ్చేనెలలో అభయహస్తం లబ్ధిదారులు డబ్బులను …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకునేదే హోలీ అని, ఎవరికీ హాని కలగకుండా సహజ రంగులతో పండుగ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్ర ప్రజలకు హోలీ విషెస్ తెలియజేశారు. ఈ హోలీ అందరికీ ఆనందం, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Read More »గ్రేటర్ వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …
Read More »కక్షపూరిత ప్రతిపక్షాలతో తెలంగాణ సమాజానికి చేటు -మంత్రి హారీష్ రావు ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించ గలుగుతున్న మేము ప్రతిపక్షాల భావ దారిద్ర్యాన్ని మాత్రం వదిలించ లేకపోతున్నాం. కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే ఎద్దేవా చేయడమేమిటి? 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే..కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ రేటులో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో సాధించిన వృద్ధిని చూసి యావత్ దేశమే అబ్బురపడుతోంది. ఈ లెక్కలు మేం చెబుతున్నవి కాదు. …
Read More »మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే …
Read More »సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.
Read More »తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో 9,057 ఆర్టీసీ బస్సులు -మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్ సమాధానం ఇచ్చారు.2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బస్సులు తిరిగితే.. 2022లో 9,057 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాడు 3,554 బస్సులు అందుబాటులో …
Read More »హైదరాబాద్లో రూ. 985 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు- మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి(ఎస్ఎన్డీపీ) కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద రూ. 985 కోట్ల 45 లక్షల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎస్ఎన్డీపీ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. …
Read More »