తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది.
Read More »వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్..అదిక సంఖ్యలో వ్యాపారాలు చేస్తూ జీవిస్తారు..వ్యాపార సముదాయాల్లో సిబ్బంది,హమాలీలు,గుమస్తాలు తమ జీవనోపాది కోసం పనిచేస్తుంటారు..వారి సర్వీస్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తారు.. కరోనా బారిన పడేందుకు,వ్యాది వ్యాప్తి చెందేందుకు ఇక్కడ నుండి ఆస్కారం ఉంటుంది.. కరోనా నివారణ చర్యల్లో బాగంగా వారి ఆరోగ్యం,ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశ్యంతో వరంగల్ తూర్పు లోని వ్యాపార,వాణిజ్య,చాంబర్ ఆఫ్ కామర్స్,గుమస్తాలకు,సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియను 28 వ …
Read More »విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు:బల్దియా మేయర్ గుండు సుధారాణి
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు..బల్దియా పరిధి 41 వ డివిజన్ శంభునిపేట గవిచర్ల క్రాస్ రోడ్,చైతన్యనగర్,ఉర్సు కరీమాబాద్,షానూర్ పుర ప్రాంతాల్లో మేయర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సానిటేషన్ స్థితి గతులను పరిశీలించారు. ఈ సందర్భం గా గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సానిటేషన్ ను పకడ్బందిగా చేపట్టాల్సిన అవసరం ఉందని,ఉదయం 10 …
Read More »లాక్ డౌన్ సడలింపులు దిశగా తెలంగాణ
తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత సడలించే దిశగాప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎల్లుండి నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పనులకు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు లాక్డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగించే ప్రతిపాదనలు కూడా …
Read More »చిన్నారుల మనసును గెలిచిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే చిన్నారి తన ప్రాజెక్టు వర్క్ లో మంత్రి పువ్వాడపై వ్యాసం.. ఐదో తరగతి చదువుతున్న ఆశ్రిత్ నాయుడు.. సామాజిక సేవా దృక్పథం గురించి సొంత వ్యాసం రాయమని విద్యార్థులకు టాస్క్ దీంతో జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారు చేస్తున్న సామాజిక సేవలపై వ్యాసం రాసిన అశ్రిత్ నాయుడు.. జిల్లాలో కరోనా కట్టడీపై మంత్రి పువ్వాడ తీసుకున్న చర్యలు బాగున్నాయని చిన్నారి …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్..జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు …
Read More »మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఫైర్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా దిగజారుతారని, ప్రస్తుతం అదే పంథాలో వెళ్తున్నారు.. ఆస్తులు కాపాడుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇందుకు నిదర్శనమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రు లు మాట్లాడారు. ఏమాత్రం ఆత్మాభిమా నం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్చేశారు. ఈటలచెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవన్నీ …
Read More »ఈటల నీతులు చెప్పుడేనా..పాటించుడు ఉందా-మంత్రి కొప్పుల
ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరిగిందని చెప్తున్న ఈటల ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. అవమానం జరిగిన చోట ఉండనని పదేపదే చెప్తున్న ఈటల.. అదే పార్టీ బీఫారంపై ఎందుకు పోటీ చేశారు? తిరిగి మళ్లీ మంత్రివర్గంలో ఎందుకు చేరారు? ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు భాగస్వాములు అయ్యారు? అని నిలదీశారు. ప్రగతిభవన్ బానిస భవన్ అయిందని అంటున్న ఈటల ఇన్నాళ్లు అక్కడ జరిగిన …
Read More »మంత్రి ఎర్రబెల్లి పిలుపు
ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్నామని ఆయన వాపోయారు. ఈ విధమైన దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని మంత్రి ఆన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం …
Read More »టిమ్స్లో 150 ఐసీయూ బెడ్స్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గచ్చిబౌలి టిమ్స్ను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్ను ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను కేటీఆర్ కలియతిరిగారు. కరోనా బాధితులను పరామర్శించి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 1200 బెడ్స్తో కరోనా రోగులకు సేవలు అందుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన 150 పడకలను …
Read More »