తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు
Read More »పంజాబ్లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్..నిఘా వర్గాలు వెల్లడి
భారత్లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్లు పాక్ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని …
Read More »“ఆపరేషన్ కైలా ముల్లర్” పేరు ఎందుకు పెట్టారు..?
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతున్న ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా సైన్యం మట్టుపెట్టిన సంగతి విదితమే. దాదాపు రెండు వారాల క్రితమే వాయువ్య సిరియాలోని ఒక గ్రామంలో బాగ్దాదీ ఉన్నాడని పక్కా సమాచారంతో అమెరికా సైన్యం దాడికి దిగింది. గ్రామంపై చక్కర్లు కొడుతున్న అమెరికా హెలికాప్టర్లను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగారు. దీంతో వారందర్నీ అమెరికా సైనికులు మొదట ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత …
Read More »పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశబ్ధాల కిందట సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు మా దేశం శిక్షణ ఇచ్చింది. కానీ అఫ్గాన్ కు అమెరికా సైన్యం వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులు మారాయి. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లపై ఇప్పుడు ఉగ్రవాద ముద్రవేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అమెరికాకు మద్దతుగా మేము చేసిన సాయమే …
Read More »ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..!
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ హత్యకు కుట్ర జరిగిందా .ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఈ ప్లాన్ కు సిద్ధపడిందా ..అంటే అవును అనే చెప్పాలి .సరిగ్గా ఎనిమిదేళ్ళ కింద ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రదారి అయిన హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జమాత్ ఉద్ దవా మరోసారి పబ్లిక్ గా ప్రకటించింది . పవిత్ర రంజన్ సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ …
Read More »