తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన …
Read More »డిసెంబరు నాటికి కరోనా కేసులు 4రెట్లు
తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 50 శాతం మేర కరోనా పాజిటివ్ కేసులు రిపోర్టు కావడం లేదని, కరోనా లక్షణాలున్నప్పటికీ భయంతో పరీక్షలు చేయించుకునేందుకు జనం ముందుకు రావడం లేదని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ) సంస్థ అధ్యయనంలో తేలింది. మిగతారాష్ట్రాలతో పొల్చితే రాష్ట్రంలో కరోనా వృద్ధిరేటు తగ్గుతోందని ఆస్కీ తెలిపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆస్కీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సుబోధ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సశ్వాత్ …
Read More »ఎల్ఆర్ఎస్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎల్ఆర్ఎస్కు తొలుత గడువు ఈ నెల 15 వరకే ప్రభుత్వం విధించింది. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చాలాచోట్ల భూ యజమానులు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఇంకా సమయం కావాలని వివిధ …
Read More »దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయండి
రైతువేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అధికారులను ఆదేశించారు.కరీంనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన సెల్ ఫోన్ ద్వారా రైతువేదికలు,కల్లాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో రైతు వేదికల నిర్మాణం ఎంతవరకు వచ్చింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి వివరాలు …
Read More »వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, …
Read More »విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సమీక్షించారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా …
Read More »క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది
క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం గండిపేట సమీపాన కోకాపేటలో రెండెకరాల స్థలాన్ని,10కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. నమూనాను పరిశీలించిన మంత్రి అందులో పలు …
Read More »అండగా ఉంటాం.. ఆధైర్యపడకండి-మంత్రి కేటీఆర్
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా హబ్సీగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్
దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ …
Read More »ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్నది. చాదర్ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు మిద్దలపైకి చేరారు. చాదర్ఘాట్ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కోఠి, దిల్సుఖ్నగర్కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ఉధృతిలో అంబర్పేట-దిల్సుఖ్నగర్ దారిలో …
Read More »