Home / SLIDER / దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయండి

దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయండి

రైతువేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అధికారులను ఆదేశించారు.కరీంనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన సెల్ ఫోన్ ద్వారా రైతువేదికలు,కల్లాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో రైతు వేదికల నిర్మాణం ఎంతవరకు వచ్చింది.

ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.వాటి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.అలాగే, ఇప్పటివరకు మంజూరైన కల్లాలెన్ని, ప్రారంభించిన పనులెన్ని, పనులు మొదలైనవి ఏ స్థాయిలో ఉన్నాయి,వాటిలో ఎన్ని పూర్తయ్యాయి.

ఎప్పటిలోగా పూర్తవుతాయని ఈశ్వర్ గారు అధికారులను వివరాలు అడిగారు.కల్లాలను కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.మంత్రి జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన డివిజనల్ ఇంజనీర్లు,అన్ని మండలాలకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్షించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat