తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు. …
Read More »మంత్రి కేటీఆర్ కల ఏంటో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలుసా..?. ఏముంటది ముఖ్యమంత్రి కావడం అని మీకు మీరే ఊహించుకోకండి. అసలు మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల గీతానగర్ లోని జెడ్పీ హైస్కూలును సీఎస్ఆర్ కింద పీపీపీ పద్ధతిలో సకల సౌకర్యాలతో అత్యద్భుతంగా మార్చారు. కార్పొరేట్ …
Read More »మా ఓపిక నశిస్తే,బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేరు-అనిల్ కూర్మాచలం
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర టీ.ఆర్.యాస్ పార్టీదని, ఇలా ప్రజలని …
Read More »తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులకు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయంలో ఉన్నతవిద్యా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కళాశాల తరగతులవారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను తరచూ తనిఖీచేయాలని సూచించారు. ప్రతిరోజు శానిటైజేషన్ …
Read More »పెద్దపల్లి కి అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ” GIFT A SMILE ” లో భాగంగా తన స్వంత డబ్బులతో అందించిన అత్యాధునిక అంబులెన్స్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో అంబులెన్స్ ను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి పెద్దమనసుతో నియోజక …
Read More »మంత్రి కేటీఆర్ను కలిసిన అంశాల స్వామి.. నెరవేరనున్న సొంతింటి కల
నల్లగొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా …
Read More »ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ కు షాక్
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఎంపీ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ …
Read More »తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం …
Read More »తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,590కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,234 ఉండగా వీరిలో 1,697 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,88,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Read More »త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశం
వేతన సవరణ, సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.వేతన సవరణ సంఘం కొద్దిరోజుల క్రితం సీఎంకు నివేదిక సమర్పిచింది. నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్కుమార్తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వారం, పదిరోజుల్లో …
Read More »