తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ …
Read More »విజయవంతంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్ళ సంఘం డైరీని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోకపేట్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సెక్రెటరీ బలరాం యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళ సంఘం అధ్యక్షులు కే ఎస్ రామారావు, జనరల్ సెక్రెటరీ కళింగ కృష్ణ కుమార్, అసోసియేట్ …
Read More »కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి …
Read More »సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు.
Read More »బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది- మంత్రి సత్యవతి రాథోడ్
దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
Read More »తెలంగాణలో ఆ ధరలను తగ్గించాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,215 కరోనా పరీక్షలు చేయగా.. 4,207 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.75శాతంగా ఉంది.
Read More »రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం
రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోదక్కుమార్ అన్నారు. ‘రాష్ట్రానికి రైల్వే లైన్లు మంజూరు చేయాలి. తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దేశంలోని పలు ప్రాంతాల నుంచి TSకు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త రైల్వే లైన్లు అవసరం’ అని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు …
Read More »తెలంగాణలో నేటి నుండి ఫీవర్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుండి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్ …
Read More »తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …
Read More »