తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …
Read More »ఎకో టూరిజం పార్క్ గా కీసరగుట్ట అటవీ ప్రాంతం..!
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని 2024 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడం కోసం కీసరగుట్టకు చేరుకుని హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పాల్గొన్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు అధికారులు, పలు కళాశాలల,పాఠశాలలు విద్యార్థినీ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా …
Read More »అభయారణ్యంలో పచ్చదనం పెంచుతా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని కీసరగుట్ట అభయారణ్యాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ అక్కడకి చేరుకుని పెద్దెత్తున మొక్కలను నాటి హారిత యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుతో కార్యకర్తలు, విద్యార్థులు, అభిమానులు పెద్దెత్తున కీసరగుట్ట కు తరలివచ్చి.. 15 వేల మొక్కలను నాటారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2042 ఎకరాల అటవీ …
Read More »నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు…విజయసాయి రెడ్డి ఫైర్ !
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ ని దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, రైతులను ఆశపెట్టి చివరకు గెలిచిన తరువాత వారిని నట్టేటిలో ముంచేశారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పని కూడా సక్రమంగా నిర్వతించలేకపోయారు. ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. ఇదేంటయ్య …
Read More »సొంత పనిని కూడా రాష్ట్ర అభివృద్ధి అని చెప్పడంలో మీకు మీరే సాటి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరని. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమేని, అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు. ఏపీ ప్రజలు చంద్రబాబుని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధంకాకపోతే …
Read More »యనమలపై విజయసాయిరెడ్డి వెటకారం మాములుగా లేదుగా..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం …
Read More »ట్విట్టర్ సాక్షిగా సుజనా చౌదరిని చెడుగుడు ఆడేసిన విజయసాయిరెడ్డి…!
ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారంటూ సుజనా చౌదరి వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదని ,. ఒక వేళ ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలంటూ సుజనా …
Read More »కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు..?
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ …
Read More »ట్విట్టర్లో మరోసారి అడ్డంగా బుక్కైన బాబు..!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్లో మరోసారి అడ్డంగా బుక్కైయ్యారు. తాజాగా ఆశావర్కర్ల తరపున చంద్రబాబు నాయుడు కొన్ని ట్వీట్లు చేశారు. ఇటీవల పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆశావర్కర్ల వేతనం రూ. 10,000/- లకు పెంచుతూ ప్రకటన చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ…చంద్రబాబు నాయకుడు ట్వీట్లు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన చంద్రబాబు పెయిడ్ బ్యాచ్…పేటీయం బ్యాచ్ అంటూ చిల్లరగా మాట్లాడి పరువు …
Read More »ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …
Read More »