మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్కు రానున్నారు. ఇవ్వాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రానున్న ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవెగౌడకు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు.
see also:19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్
బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రగతిభవన్ కు చేరుకోనున్న మాజీ ప్రధాని దేవెగౌడ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ఈ సమావేశం సందర్భంగా జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ , ఇటీవల కర్నాటలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వంటి అంశాల గురించి చర్చింనున్నారు. హైదరాబాద్లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌడ నగరానికి విచ్చేస్తున్నారు.
see also:స్వంత ఖర్చులతో పెళ్లి చేయిస్తా..ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి