టిక్ టాక్ లైకులు కోసం కుర్రాళ్ళు శృతిమించిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది టిక్ టాక్ పిచ్చికి బానిసలైపోగా.. మరికొందరు పిచ్చిపనులు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి ఇప్పుడు చెన్నైలో జరిగింది. అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ యువకుడు.. తప్పని తెలిసినా కూడా ఏకంగా పోలింగ్ బూత్ లోకే, మొబైల్ తీసుకెళ్లి.. ఏ పార్టీకి ఓటు వేసింది రికార్డు చేసాడు. ఆపై ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియొ వైరల్ గా మారింది.