Home / SLIDER / కరీంనగర్ మేయర్‌పై వెంకయ్యనాయుడు, కేటీఆర్‌ ప్రశంసలు..!!

కరీంనగర్ మేయర్‌పై వెంకయ్యనాయుడు, కేటీఆర్‌ ప్రశంసలు..!!

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించినట్టు నగర మేయర్ రవీందర్‌సింగ్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేయర్ రవీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేయర్ రవీందర్‌ సింగ్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు.

” కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు” అంటూ వెంకయ్యనాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒక్క రూపాయికే ఈ కార్యక్రమాలను పూర్తిచేయడం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్ చేశారు . కరీంనగర్‌ మేయర్‌, ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ట్విటర్లో అభినందించారు. ఇదే ట్వీట్‌ను అరవింద్ కుమార్‌కు ట్వీట్ చేసిన కేటీఆర్ మిగితా అర్బన్ ఏరియాల్లో ఈ స్కీంను ప్రవేశపెట్టే అంశంపై దృష్టిసారించాలని కోరారు. కేటీఆర్‌ విజ్ఞప్తి మేరకు ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat