తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించినట్టు నగర మేయర్ రవీందర్సింగ్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేయర్ రవీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేయర్ రవీందర్ సింగ్పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు.
” కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్, మేయర్ రవీందర్సింగ్కు అభినందనలు” అంటూ వెంకయ్యనాయుడు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఒక్క రూపాయికే ఈ కార్యక్రమాలను పూర్తిచేయడం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు . కరీంనగర్ మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ట్విటర్లో అభినందించారు. ఇదే ట్వీట్ను అరవింద్ కుమార్కు ట్వీట్ చేసిన కేటీఆర్ మిగితా అర్బన్ ఏరియాల్లో ఈ స్కీంను ప్రవేశపెట్టే అంశంపై దృష్టిసారించాలని కోరారు. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
My compliments to Karimnagar Mayor, MLA & Corporators for this humane initiative of nominal ₹1 charges for Anthima Yatra (funeral). Will be a great relief to the poor ??@arvindkumar_ias @cdmatelangana can we look at the possibility of implementing the same in other ULBs? pic.twitter.com/J4kAxMTjsd
— KTR (@KTRTRS) May 21, 2019
My compliments to Karimnagar Mayor, MLA & Corporators for this humane initiative of nominal ₹1 charges for Anthima Yatra (funeral). Will be a great relief to the poor ??@arvindkumar_ias @cdmatelangana can we look at the possibility of implementing the same in other ULBs? pic.twitter.com/J4kAxMTjsd
— KTR (@KTRTRS) May 21, 2019