తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు.
ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా బట్టలు పంపిణీ చేసిందని తెలిపారు. యేసు ప్రభు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.. ఈ పండుగను కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో వేడుకగా జరుపుకోవాలని కోరుకున్నారు..