తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సిద్దిపేట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మనం ఏది పోగోట్టుకున్న కానీ తిరిగి సంపాదించుకోవచ్చు.కానీ ఆరోగ్యం పాడైతే తిరిగి దాన్ని వెనక్కి తెచ్చుకోలేము” అని అన్నారు.
మంత్రి హారీష్ రావు ఇంకా మాట్లాడుతూ”సిద్దిపేటలో ఉన్న పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ శుచి,శుభ్రత లక్ష్యంగా మొత్తం ఇరవై సూత్రాలను పాటించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించే హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ప్రోత్సహాకాలు ఇస్తామని అన్నారు.ఇందులో భాగంగా తొలి ప్రోత్సహకంగా రూ.10,000 ఇస్తాము..ద్వితీయ ప్రోత్సాహాకంగా రూ.5,000లు ఇస్తామని మంత్రి హారీష్ రావు ప్రకటించారు..