Home / SLIDER / స్వేచ్చ లభించిన రోజు ఇది..మంత్రి జగదీష్‌ రెడ్డి

స్వేచ్చ లభించిన రోజు ఇది..మంత్రి జగదీష్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ దినంగా నిలబడి పోయింది. నిజాం ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలనలో మగ్గి పోయిన తెలంగాణ ప్రజలకు జూన్ 2 నుండి స్వరాష్ట్రంలో సుపరిపాలన అందుబాటులోకీవచ్చిన సుదినం. వచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో యావత్ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగేందుకు దోహద పడ్డ దినం అని మంత్రి పేర్కొన్నారు. 7 సంవత్సరాల పాలనలో అది రుజువు అయింది. అటువంటి రోజును తెలంగాణ ప్రజలు పండుగగా జరుపుకునే పర్వదినం ఇది. కాకపోతే కరోనా మహమ్మారి ఉన్నందున ఎవరికి వారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ… మునుముందు మరిన్ని తీపి కబుర్లతో అద్భుత ఫలితాలు సాధించాలని రైతును రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సిద్దించాలని కోరుకుంటున్నాను అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat