నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది. వీటిపై విధించే ఛార్జీలను, ఈ మొత్తాన్ని ఎస్బీఐ సమీక్షించింది. కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ సోమవారం తెలిపింది. అంతేకాక పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులు, మైనర్ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్లు కేటగిరీలను ఇప్పటికే ఎస్బీఐ ఈ నిబంధన నుంచి మినహాయించిన సంగతి తెలిసిందే. మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ను నిబంధనను పాటించిన వారికి వేస్తున్న ఛార్జీలను కూడా 20 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. అందరికీ ఈ తగ్గించిన ఛార్జీలే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.