ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే .
అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక ఇటుక రాయి కూడా పడలేదని జగమెరిగిన సత్యం .ఇటీవల ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో సమావేశం అయి రాజధాని నిర్మాణాల గురించి డిజైన్లను పరిశీలించి సూచనలు ..సలహాలు ఇవ్వాలని కోరారు .అంతే కాదు ఏకంగా రాష్ట్ర మంత్రి అయిన నారాయణ కూడా రాజమౌళి తో సమావేశం అయ్యి రాజధాని నిర్మాణాల డిజైన్ల గురించి చర్చించారు .
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిలోని పవిత్ర సంగమం దగ్గర వెంకటేశ్వరుని ఆకృతి ఆలయ శిఖర నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాల ప్రజంటేషన్ గురించి దర్శకుడు బోయపాటి శ్రీను సీఎం చంద్రబాబుకు అందించారు.ఈ ప్రజెంటేషన్ లో తిరుమలేశుని మూడు నామాలు, ఆలయ గోపురం కింద నుంచి గోదావరి నదీ ప్రవాహం సాగేలా నిర్మాణం ఈ నిర్మాణం ఉండనుంది అని వివరించినట్లు సమాచారం . అంతే కాదు ఈ ఆలయ శిఖరం ఆకృతి దశావతారాల థీమ్తో తయారు చేసినట్లు సమాచారం..