నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు,టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు… సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది.
ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపుపై తన సోదరి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితకు అన్న అయిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధాంతాలను పక్కనపెట్టి కూటమి కట్టినా టీబీజీకేఎస్ గెలుపును అపలేకపోయారని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలుపుకోసం విశేష కృషిచేసిన తన సోదరి కవితకు మంత్రి అభినందనలు తెలిపారు.