ప్రముఖ యాంకర్, నటి మల్లిక (39) సోమవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె, 20 రోజులుగా కోమాలోనే ఉంది. 20 ఏళ్ల క్రితం టీవీ వ్యాఖ్యత, యాంకర్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించింది. మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు సినిమాలో కృష్ణకు భార్యగా నటించింది. కొన్ని సినిమాల్లో అక్క, అత్త పాత్రల్లోనూ నటించింది. ఎక్కువగా టీవీ సిరియల్స్ ద్వారా ఇంటింటికీ పరియం అయ్యింది. ప్రముఖ యాంకర్ సుమకు స్నేహితురాలు. మల్లిక అసలు పేరు అభినవ. యాంకర్ గా టీవీ రంగంలో ప్రవేశించి.. అనతికాలంలోనే మంచి యాంకర్గా పేరు తెచ్చుకుంది.
ఇక ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. నాతిచరామి అనే సీరియల్ లో ప్రస్తుతం బామ్మ పాత్రలో నటిస్తుంది. కొంతకాలంగా ఒబేసిటీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతుంది. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అంతే కాదు ఉత్తమ యాంకర్గా అవార్డులను సైతం సొంతం చేసుకుంది మల్లిక. పెళ్లి చేసుకున్నాక నటనకు దూరమై కుటుంబ వ్యవహారాలు చేసుకుంటూ వస్తుంది. ఈ లోపే ఆమెను అనారోగ్యం కాటు వేసింది. ఈమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్త పరిచారు. మల్లిక భౌతికకాయాన్ని రేపు ఉదయం హైదరాబాద్కు తరలించనున్నారు.