తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం పెరిగిపోతున్న రక్తపోటు, మధుమేహ బాధితులసంఖ్య తగ్గించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు .
అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది .ప్రస్తుత పరిస్థితుల వలన గుండె ,కిడ్నీ ,బ్రెయిన్ సంబంధిత వ్యాధులకు గురై రాష్ట్రంలోని ప్రజలు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చ్గు చేస్తోన్నారు .అంతే కాకుండా ఈ వ్యాధుల వలన మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది .అయితే బీపీ ,షుగర్ లాంటి వాటిని ఆదిలోనే గుర్తిస్తే వాటిని నివారించడం చాల సులభం .
అందుకే సర్కారు వాటిని ఆదిలోనే గుర్తించే క్రమంలో రానున్న కాలంలో ప్రతి నెల ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్లి మరి బీపీ ,షుగర్ లాంటివి చెక్ చేయాలనీ సంబంధిత శాఖ ను ఆ దిశలో పని చేయించాలని సర్కారు ఆలోచిస్తుంది .ఇలా చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వీటి బారిన ఎంత మంది పడుతున్నారు .ఎంతమందికి చికిత్స చేయించాలి .అనే వివరాలు తెలిస్తే సరైన చికిత్స చేయించి ఈ వ్యాధుల వలన మరణించే వారి సంఖ్యను తగ్గించవచ్చు అని సర్కారు ఆలోచిస్తుంది .అయితే ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేయాలని సర్కారు భవిష్యత్తు కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది .