ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దాదాపు సుమారు 40 నిమిషాలపాటు మంతనాలు జరిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.ఈ భేటీలో జగన్ వెంట ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.ఈ రోజు తీర్పు వెలువరించిన కోర్టు ఆరు నెలలో ఆరు సార్లు విచారణకు హాజరైతే చాలు అని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే .
