ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .
తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ చేసిన రాజీనామా చేసిన లేఖను ఆమోదిస్తే మరల నియోజక వర్గంలో బరిలోకి దిగి తన సత్తా చూపిస్తాను అని ఆయన తేల్చి చెప్పారు .
అయితే అంతగా తన గెలుపుపై నమ్మకం ఉంటె రాజీనామా చేసింది నిజమైతే అధికారంలో ఉన్నది టీడీపీ పార్టీనే ..స్పీకర్ కూడా ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తోన్నాడు .రాజీనామా ను ఆమోదించుకొని మరల పోటి చేసి గెలవాలని గతంలోనే వైసీపీ శ్రేణులు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సవాళ్ళు విసిరిన విషయం విదితమే .