Home / SLIDER / రేవంత్‌ రెడ్డికి మరో భారీ షాక్..!

రేవంత్‌ రెడ్డికి మరో భారీ షాక్..!

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డికి మరో  భారీ షాక్ తగిలింది . కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 700 మంది కార్యకర్తలు ఈ రోజు  తెలంగాణ భవన్‌లో అధికార  టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గులాబీ వనంలో చేరిన వారి వివరాలు 
కొడంగల్ హెడ్ క్వాటర్ జడ్‌పీటీసీ శరణమ్మ హనుమంతురెడ్డి, కొడంగల్ మండలం చిట్లపల్లి ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ గౌడ్, దౌల్తాబాద్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, దౌల్తాబాద్ టీడీపీ సర్పంచ్ పార్వతమ్మ, గుండెపల్లి టీడీపీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, చంద్రకల్ టీడీపీ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ ఆశన్న, దౌల్తాబాద్ మండలం కో ఆప్షన్ మెంబర్ జాకీర్, కోస్గి మండలం చెన్నారం మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి, బిజ్జరాం టీడీపీ సర్పంచ్ కళావతి, బిజ్జరాం మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్య, గ్రామాధ్యక్షుడు పటేల్ బస్వరాజు, అంతారం దౌల్తాబాద్ మండలం ఉప సర్పంచ్ బసంత్ రెడ్డి, దౌల్తాబాద్ పీఏసీఎస్ డైరెక్టర్ రాజప్ప, దౌల్తాబాద్ మండలం గోకపస్లాబాద్ మాజీ ఎంపీటీసీ ఆనంతయ్య, దౌల్తాబాద్ మండల హెడ్ క్వాటర్ వార్డ్ మెంబర్స్ నారాయణ, ఎల్లమ్మ, మల్కాయ్య గౌడ్, శ్రీనివాస్ వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లతో పాటు 700 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat