ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీ నేతలపై అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నయెల్లో మీడియా నిత్యం అసత్య వార్తలను ప్రచారం చేస్తోంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు .తాజాగా జగన్ పై ఉన్న అక్కసును మరోసారి వెల్లగట్టి అడ్డంగా బుక్ అయింది.
వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట ఇరవై ఐదు స్థానాల్లో పాదయాత్ర ,మరో యాబై స్థానాల్లో బస్ యాత్ర నిర్వహించాలని వైసీపీ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా తన పాదయాత్రలో ప్రజల సమస్యల కోసం ..ప్రజల తరపున పోరాడటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను కాబట్టి ప్రతి శుక్రవారం విచారణకు హాజరై విషయం నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించాడు .
దీంతో కోర్టు నెలలో అన్ని శుక్రవారాలు కాకపోయిన ఆరు నెలలో ఆరు వారాలు హాజరైతే చాలు అని తీర్పునిచ్చింది .ఈ క్రమంలో ఇక్కడే జగన్ పై విషప్రచారం చేయబోయి అడ్డంగా బుక్ అయింది .”జగన్ ప్రతివారం రావాల్సిందే “అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి మరి యెల్లో మీడియా విష ప్రచారం చేయడం మొదలెట్టింది .నిజానికి జగన్ పై అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ పెట్టిన అక్రమ కేసుల్లో అన్నిటికి కొట్టి వేయగా మరో మూడు కేసులలో మాత్రమే విచారణ జరుగుతుంది .ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తనపై విచారణ జరగకుండా స్టే తెచ్చుకుంటే జగన్ మాత్రం తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి విచారణకు హాజరవుతున్న జగన్ పై ఇలా విష ప్రచారం చేస్తూ జర్నలిజం విలువలకు తిలోదకాలు వదులుతుంది .