తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు టీఆర్ఎస్ఎల్పీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు… సబ్జెక్ట్ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. చర్చకు సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తామంటోందని, ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ ముట్టడిని సమర్థిస్తారో లేదో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యులు కోరే అంశంపై చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీ ముట్టడిని విరమింపచేయాలన్నారు. అలాగే ఏదైనా జరగరానిది జరిగితే కాంగ్రెస్దే బాధ్యత అని, 3 నుంచి 4 వారాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నామని మంత్రి అన్నారు.
