Home / ANDHRAPRADESH / కర్నూలు జిల్లాలో మొదలైన శిల్పా బ్రదర్స్ హవా..గ్రౌండ్ వర్క్ స్టార్ట్ ..

కర్నూలు జిల్లాలో మొదలైన శిల్పా బ్రదర్స్ హవా..గ్రౌండ్ వర్క్ స్టార్ట్ ..

ఏపీలో కర్నూలు జిల్లాలో నిన్న మొన్నటి వరకు మారుమ్రోగిన పేరు శిల్పా బ్రదర్స్ .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభపెట్టిన డబ్బు ,పలురకాల కుట్రలను తట్టుకొని మరి ఆ పార్టీ అభ్యర్ధి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కి వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటినిచ్చారు .

ఆ సమయంలోనే తను ఎమ్మెల్సీగా గెలిచి పట్టుమని పది నెలలు కానీ శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు .నంద్యాల ఉప ఎన్నికల తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న శిల్పా బ్రదర్స్ దెబ్బ తిన్న పులిలా మరల రంగంలోకి దిగారు .

దిగడంతోనే జిల్లాలోని శ్రీశైలం నియోజక వర్గంలోని ఆత్మకూరు లోని అధికార టీడీపీ పార్టీకి చెందిన పదమూడు మంది కార్పొరేటర్లు వైసీపీలో చేర్చుకొని తము మరల పంజా విసరడానికి సిద్ధమయ్యం అని అధికార టీడీపీ పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపించారు .త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అన్న అయిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం ,శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైలం నియోజక వర్గాన్ని కేటాయించనున్నట్లు జగన్ ఫిక్స్ చేశాడు .అందుకే ఇప్పటి నుండే శిల్పా బ్రదర్స్ గ్రౌండ్ వర్కును స్టార్ట్ చేశారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి ప్రతికారాన్ని తీర్చుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల ,శ్రీశైలం నియోజక వర్గాల్లో గెలిచి ఈ విజయాన్ని జగన్ కు కానుకగా ఇవ్వాలని శిల్పా బ్రదర్స్ పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు అంట .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat