వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28 నుంచి లండన్, యూరప్ లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో లండన్ టూర్కు అునమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆరు రోజుల లండన్ టూర్కు అనుమతి ఇవ్వాలని ఆయన మెమో సమర్పించారు. దీంతో లండన్ వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని వైసీపీ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, నవంబర్ 6 నుంచి తలపెట్టిన పాదయాత్రలో జగన్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
