తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెండ్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్రెడ్డి రాజీనామాతో రాష్ట్ర టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఈ రోజు సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో రేవంత్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి తన రాజీనామాను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అయితే శశికళ.. రేవంత్ బాటలోనే నడిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటానని లేఖలో ఆమె స్పష్టం చేశారు.