తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అప్పటి ఉద్యమం సమయంలో ..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఇటు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన్నలను పొందటమే కాకుండా మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్నారు .ఈ నేపథ్యంలో గత మూడున్నర ఏండ్లుగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తూ కోటి ఎకరాలకు నీళ్ళను అందించే భగీరథ ప్రయత్నం చేస్తోన్నారు .
ఒకవైపు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూనే మరోవైపు పార్టీను కింది స్థాయి నుండి బలోపేతం చేసే పనిలో పడ్డారు మంత్రి హరీష్ .ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ రేవంత్ రెడ్డి పార్టీ మారతాడు అనే అంశం .రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లడాన్ని ముందే తెలుసుకున్న మంత్రి హరీష్ అక్కడ జరగుతున్న రాజకీయ పరిణామాలను పసిగట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కింది స్థాయి నేతలను ,క్యాడర్ ను అధికార పార్టీలోకి తీసుకురావడానికి మంత్రి హరీష్ రావు పక్క ప్రణాళికలు ,వ్యూహాలు రచించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు అని సమాచారం .
దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోవడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలను ,కార్యకర్తలను ముఖ్యంగా కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలను ,కార్యకర్తలను టీఆర్ఎస్ వైపు మళ్ళించడంలో మంత్రి హరీష్ రావు సఫలీకృతం అయ్యారు .రేవంత్ రెడ్డి ఎప్పుడు అయితే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వచ్చిందే తడవు టీడీపీ నేతలు ,కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కేటీఆర్ ,లక్ష్మారెడ్డి ,ఎంపీ జితేంద్ర రెడ్డి ,ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో చేరారు .రాజకీయంలో ప్రతిపక్షాల ప్లాను ముందుగానే పసిగట్టి వాటికి బలమైన కౌంటర్ సిద్ధం చేయడమే కాకుండా ..ముందుగా జరిగే రాజకీయ పరిణామాల్ని తెలుసుకొని వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో మంత్రి హరీశ్ తను ఎంత నేర్పరి అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పారు .