ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్తిపాడు మండలంలో పత్తిపంటను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రిని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి.
దీంతో మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటను ఈ రోజు గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు పురుగు మందుల కంపెనీ పై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా లేదని మంత్రిని నిలదీశారు.రైతుల గురించి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని మంత్రిపై విరుచుకుపడ్డారు .