Home / POLITICS / నిండు సభలో నవ్వుల పాలైన సీఎల్పీ నేత జానారెడ్డి..

నిండు సభలో నవ్వుల పాలైన సీఎల్పీ నేత జానారెడ్డి..

జానారెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత సీనియర్ నాయకులు .ఈ ప్రాంతం నుండి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ మాజీ మంత్రి .అంతటి రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డి నిన్న బుధవారం శాససభలో జరుగుతున్న వ్యవసాయం పై చర్చలో నవ్వులు పాలైయ్యారు .గత కొద్ది రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న బుధవారం వ్యవసాయం మీద చర్చ జరుగుతుంది .

ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఒక్కరు కూడా లేరు .ప్రశ్నలు వేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ ఆ పార్టీకి చెందిన సభ్యులు కానీ ఒక్కరు కూడా లేరు .దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “రైతుల పట్ల కాంగ్రెస్ సభ్యులకు ఎంత శ్రద్ధ ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది అని మంత్రి పోచారం కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేరనే విషయాన్నీ ప్రస్తావించారు .

అప్పుడే సభలోకి వస్తున్న సీఎల్పీ నేత జానారెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి కూడా సభలో లేరని అన్నారు .అయితే సీఎం తరపున మంత్రి వర్గంలో ఉన్న ప్రతి మంత్రికి బాధ్యత ఉంటుందని ..వ్యవసాయ మంత్రిని తాను సభలో ఉన్నానని పోచారం గుర్తు చేశారు .దీంతో రాజకీయంలో ఇటు శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న అత్యంత సీనియర్ సభ్యుడైన జానారెడ్డికి ఈ విషయం తెలియదా అని ఇతర పార్టీ సభ్యులు గుసగుసలాడుకున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat