తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం చుట్టూ 12 లాజిస్టిక్ హబ్లు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తర్వాత కేటీఆర్, రెసిడెంట్ కమిషనర్ అరవింద్కుమార్ తెలంగాణ స్టాల్స్ను సందర్శించారు. జహీరాబాద్లో రూ.6 వేలకోట్లతో సమగ్ర వ్యవసాయం ఆహార పరిశ్రమ నెలకొల్పేందుకు దక్షిణ అగ్రో పోలీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన అగ్రిమెంట్ (MOU) కుదుర్చుకుంది.
Minister @KTRTRS discussing with potential investors @worldfoodindia 2017 event in Delhi. pic.twitter.com/nWQOXojocY
— Min IT, Telangana (@MinIT_Telangana) November 3, 2017
జర్మన్ ఏషియా అసోసియేషన్ నాలెడ్జ్, టెక్నాలజీ అంశాల్లోనూ తెలంగాణ ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం(నవంబర్ -4) మరో 10 సంస్థలతో MOU కుదుర్చుకోనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.
Another major investment into Telangana. Dakshin Agropolis signs an MoU today to set up Agri/Food processing park at NIMZ, Zahirabad 1/2 pic.twitter.com/FOft3HSOVE
— KTR (@KTRTRS) November 3, 2017