తెలంగాణ వస్తే పరిపాలించుకోవటం చేతకాదు అని హేళన చేసినవారే…ఇవ్వాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని చులకన చేసిన పార్టీలు… నాయకులు ఇప్పుడు తమ పాలనను ప్రశంసిస్తున్నారని వివరించారు. నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు.
టీఆర్ఎస్ లో చేరిన వారిలో కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు టీడీపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, టీడీపీ కనగల్ మండల అధ్యక్షుడు పాతగోని యాదయ్య గౌడ్, తిప్పర్తి మండల అధ్యక్షుడు తొండంగి గోవర్దన్, నల్గొండ మండల అధ్యక్షుడు దేపా వెంకట్ రెడ్డి, నల్గొండ 19వ వార్డ్ కౌన్సిలర్, షేక్ మోహిన్, 40 వార్డ్ కౌన్సిలర్ యుగేందర్ రెడ్డి, కాకుల కొండారం ఎంపీటీసీ మల్లేష్ గౌడ్, దుప్పలపల్లి ఎంపీటీసీ పొడిశెట్టి లలిత, పజ్జూరు ఎంపీటీసీ ఏనుగు దామోదర్ రెడ్డి, రామచంద్రాపురం సర్పంచ్ బళ్లారి మల్లయ్య గౌడ్, బోయిన్ పల్లి సర్పంచ్ యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు ఎండి ఫయిద్, సందినేని జనార్దన్ రావు, భాస్కర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి గాదె రాం రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మందాడి సైదిరెడ్డి తో పాటు వందల మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటుగా ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు