రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిల్చొని నిరసన తెలుపడంతో.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని.. ఆ క్రమంలో ప్రతీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వారు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తారని సీఎం తెలిపారు. ఛలో అసెంబ్లీ అని వస్తే సీఎం లేదా సంబంధిత శాఖ మంత్రులు లేదా కొన్ని పార్టీ నేతలు కలిసి నిరసన తెలిపే వారి వద్దకు వెళ్లి రిప్రజేంటేషన్ తీసుకునే వాళ్లను సీఎం గుర్తు చేశారు. అవసరమైతే గన్పార్క్ లేదా పబ్లిక్గార్డెన్ సమీపంలో వారితో మాట్లాడేదని తెలిపారు. సమస్యలు ఉంటాయి.. వాటికి పరిష్కారాలు ఉంటాయన్నారు సీఎం. పబ్లిస్టి కోసం రక్కస్ చేయడం సరికాదని సీఎం అన్నారు. గతంలో అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీచార్జి జరగడం.. అప్పట్నుంచి ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు అమలు చేయడం వస్తుందన్నారు.
