కొత్త పాస్బుక్లను 26 సెఫ్టీ ఫీచర్లతో వచ్చే ఏడాది జనవరి 26న పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. జనవరి 26న శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో మాదిరిగా పాస్బుక్స్ ఉండవని సీఎం తేల్చిచెప్పారు. పాస్పోర్టు తరహాలో పటిష్టంగా పాస్బుక్స్ ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు నెల రోజులు నీటిలో పడేసిన ఏం కాదన్నారు. వాటర్ ప్రూఫ్తో ఉంటుందన్నారు. ప్రత్యేకమైన పెన్నుతో రాస్తేనే దానిపై పడుతుందన్నారు. ఇష్టమొచ్చిన పెన్నుతో రాస్తే దానిపై పడదన్నారు. సంబంధిత అధికారులకు కేటాయించిన స్పెషల్ పెన్నులతోనే ఆ పాస్బుక్స్పై రాసేందుకు వీలు ఉంటుందన్నారు. ప్రతి రైతుకు ఒక సర్వే నంబర్ కేటాయించాలనేది తన ప్రతిపాదన అని సీఎం తెలిపారు. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఒకే సర్వే నంబర్ ఇస్తే బాగుంటుందని సీఎం చెప్పారు.