Home / ANDHRAPRADESH / దమ్ముంటే ప్రజల్లోకి రా..మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత సవాల్

దమ్ముంటే ప్రజల్లోకి రా..మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత సవాల్

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి వైసీపీ పార్టీ సమన్వయకర్త సుధీర్‌ రెడ్డి బహిరంగంగా సవాల్‌ విసిరారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘ఆదినారాయణరెడ్డి నీకు నిజంగా దమ్ముంటే ప్రజల్లోకి రా… ఎవరు గెలుస్తారో చూద్దాం. జమ్మలమడుగుకు ఆయన చేసిందేమీ లేదు. ఆదినారాయణరెడ్డి తన బామ్మర్ది కేశవరెడ్డిని రక్షించుకునేందుకే పార్టీ మారారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన చేసిందేమీలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు.’అని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat