ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్రలో భాగంగా.. ప్యారడైజ్ లీక్స్ విషయంలో స్పందిచింన జగన్.. చంద్రబాబుకు 15 రోజులు గడువు ఇచ్చి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ విసిరిన సవాల్కి చంద్రబాబు విచిత్రంగా స్పందిచారు.
ప్యారడైజ్ లీక్స్ వ్యవహారంలో జగన్ పేరు పత్రికల్లో వచ్చింది. జగన్ అవినీతి పరుడని అక్రమ పెట్టుబడులు ఉన్నాయని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. వాటి మూలాలేంటన్నవి వాళ్లు రాశారని.. ఆ వ్యవహారాన్ని నిరూపించుకోవాల్సింది జగనే అని చంద్రబాబు అన్నారు. దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు.
ప్రియమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అంటూ.. అయ్యా సీయం గారూ ప్యారడైజ్ పత్రాలుగా పిలుస్తున్న బెర్ముడా పత్రాల్లో జగన్ పేరు ఎక్కడా ప్రస్తావనే లేదు. ఆయన పేరుగాని.. జగన్కు సంబంధించిన కంపెనీల పేరు గానీ బెర్ముడా పత్రాల్లో అణుమాత్రమైనా లేదు. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హెటిరో గ్రూపు ప్రమోటర్ల పేర్లు ఉన్నాయి.
అంతే కాకుండా దానిలో హెటిరో ప్రమోటర్లు ఎ. నరసారెడ్డి, బి. పార్ధసారథి రెడ్డి పేర్లు ఉండడంతో వారు వివరణ కూడా ఇచ్చారు.. అది తమ వ్యక్తిగతం కాదని హెటిరోకు అనుబంధ సంస్థ అని కూడా చెప్పింది. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సైతం తన విదేశీ కంపెనీలకు సంబంధించి సమస్త సమాచారాన్ని దర్యాప్తు నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు గతంలోనే చెప్పారు.
ఇక జగన్మోహన్రెడ్డిపై సీబీఐ కేసు విషయం ఏంటంటే..సాక్షి మీడియాలో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం. సాక్షి లో ఇండియా సిమెంట్స్, అరబిందో ఫార్మా, రాంకీ వంటి లిస్టెడ్ సంస్థలే కాక… హెటెరో వంటి అన్లిస్టెడ్ సంస్థలు, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి పారిశ్రామికవేత్తలూ పెట్టుబడులు పెట్టాయి. దీనికి సంబంధించి హెటెరోపై, నిమ్మగడ్డ ప్రసాద్పై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అంటే జగన్ కేసుతో సంబంధం ఉన్న హెటెరో సంస్థకు బెర్ముడాలో కంపెనీ ఉన్నదనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన దనికి అసలు అర్ధం ఇదే.
అయితే ఈ విషయాన్ని చంద్రబాబు అనుకూల మీడియా జగన్ను టార్గెట్ చేస్తూ విషపు కథనాలు వల్లించడం.. చంద్రబాబు ప్యారడైజ్ వ్యవహారంలో జగనే నిరూపించుకోవాలని స్టేట్ మెంట్ ఇవ్వడంతో రాజకీయ వర్గాలు సేతం ఆశ్చర్యపోతున్నాయని.. జగన్ పై బురద జల్లే ముందు చంద్రబాబు కడుక్కోవాలని.. నిజంగానే నిరూపించుకునే దమ్ముంటే.. ఓటుకు నోటు కేసులో వినిపించింది తన గొంతు కాదని నిరూపించుకోవాలని.. ఆ రోజు దొరికిన యాభై లక్షలు తనవి కాదని నిరూపించుకోవాలని.. జగన్ సవాల్ విసరగానే నలభైఎళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా ఏంటీ.. జగన్ స్వవాలు స్వీకరించలేకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.