జగన్ పాదయాత్ర కడప నుండి కర్నూలుకు చేరుకుంది. కర్నూలులో మొట్టమొదటగా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ నియోజక వర్గం ఆళ్లగడ్డ నుండే జగన్ పాదయాత్ర మొదలైంది. దీంతో రాజకీయ వర్గాల్లో సైతం ఆశక్తి నెలకొంది. జగన్ కూడా ఆళ్లగడ్డలో అడుగుపెట్టగానే అఖిల ప్రయ, చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.
ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆళ్లగడ్డలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ జరిగిందా.. అని రైతుల నుంచే జరగలేదని జవాబు చెప్పించారు.జగన్ పాదయాత్ర కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగుడుగునా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డి యాత్ర ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక్క పంటకు కూడా నీరివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
రాజోలిబండ ప్రాజెక్టు అతీగతీ లేదని, గుండ్రావుల ప్రాజెక్టు ఏమైందో జవాబు చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని చెప్పారు. శ్రీశైలంలో నిరున్నా రాయలసీమకు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన చెందారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారని తెలిసి చంద్రబాబు ఆన్ లైన్లో దానిని తొలగించారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద మంత్రి అఖిలప్రియ అడ్డాలో జగన్ పాదయాత్రకు జనం నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.