నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి…పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చొరవ ఫలితంగా మూడు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిమున్సిపాలిటీల రూపు రేఖలు మారనున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిమేరకు పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ సూచనతో శనివారం హైదరాబాద్లో ఎంపీ కవిత నేతృత్వంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా సమావేశంలోని నిర్ణయం ప్రకారం…మున్సిపల్ ఆఫీసులు ఈ-ఆఫీసులుగా మారనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే సౌకర్యం కూడా సిద్ధంకానుంది. టాయిలెట్స్ అవసరమున్న చోట ఏర్పాటుచేస్తారు. టాయిలెట్స్ ఎంత దూరంలో ఉన్నాయో తెలిపేలా బోర్డుల ఏర్పాటు చేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తారు. మినీ టాంక్ బండ్లు, పార్క్లు,జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఈ లైబ్రరీలు, బస్ షెల్టర్లు, మహిళా క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్ హాల్స్, పెళ్లిళ్ల కోసం ప్రత్యేక ప్రాంగణాలు నిర్మిస్తారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల సుందరీకరణ లక్ష్యంగా స్పెషల్ ఫండ్ను వినియోగిస్తారు. టౌన్లలోని ప్రధాన రోడ్లనుఅభివృద్ధి చేస్తారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ కూడళ్లను అభివృద్ధి చేస్తారు. హైమాస్ లైట్లను అమరుస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటుచేస్తారు. అవసరమున్న చోట ఆధునిక రీతిలో బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తారు. సిరిసిల్ల మున్సిపాల్టీ అమలు చేస్తున్నవిధానాన్నిజిగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిమున్సిపాలిటీలలోనూ అమలు చేయాలని సమన్వయ సమావేశంనిర్ణయించింది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేందుకు డి.ఆర్.సి (డ్రై రిసోర్స్సెంటర్)ను ఏర్పాటు చేస్తారు. దీనిని మహిళాసంఘాలు నిర్వహిస్తాయి. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా ఉంచడంపైప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇళ్లలోంచితడి, పొడి చెత్తను సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బందిసేకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి డివిజన్కుఒకటి చొప్పున చెత్త సేకరించే వారికి ఆటో కమ్ఓనర్ పథకాన్ని వర్తింప చేస్తారు. మహిళలకు ప్రత్యేకించి మహిళా క్రీడా ప్రాంగణాలుఏర్పాటు చేస్తారు. వీటిలో శారీరక ధారుఢ్యం పెంచే జిమ్లను ఏర్పాటు చేస్తారు. స్విమ్మింగ్ పూల్స్నునిర్మిస్తారు. ఈ క్రీడా ప్రాంగణాల్లో మహిళలకుప్రైవసీ ఉండేలా చుట్టూ ప్రహరీ గోడలను నిర్మిస్తారు. అందరికీ ఆరోగ్యం కోసం మున్సిపాలిటీల్లో రెండు రకాల జిమ్లను ఏర్పాటు చేస్తారు. ఓపెన్ జిమ్లు, కమ్యూనిటీ జిమ్లు ఏర్పాటు చేస్తారు. వీటిని మున్సిపాలిటీలు నిర్వహిస్తాయి. పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూఆహ్లాదాన్ని పంచేలా పార్కులను తీర్చిదిద్దుతారు. జగిత్యాలలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఒకపార్కు, అమర వీరుల స్తూపం వద్ద మరో పార్కు, హౌజింగ్ బోర్డులో మూడో పార్కు, నాలుగోపార్కుగా ప్రస్తుతమున్న మున్సిపల్ పార్కును సుందరీకరిస్తారు. అక్కడే అతి పెద్ద పార్కు, మినిటాంక్ బండ్ను ఏర్పాటు కానుంది.
కోరుట్ల, మెట్పల్లి టౌన్లలోనూ పార్కులను తీర్చిదిద్దుతారు. మల్టిపర్పస్ టౌన్ హాల్స్ ను నిర్మిస్తారు. గౌండ్ ఫ్లోర్లో ఫంక్షన్లు నిర్వహించునేలా తయారుచేస్తారు. పై అంతస్తులో కళా ప్రదర్శనలకుఅనువుగా డయాస్, సీటింగ్ అరేంజ్ మెంట్స్, లైటింగ్ ఏర్పాటు చేస్తారు. అందులో కొంత భాగంపెయింటింగ్స్ ప్రదర్శన కోసం కేటాయిస్తారు. సాహితీ సమావేశాలు, చర్చా గోష్టులునిర్వహించుకునేలా మినీ మీటింగ్ హాలును కూడానిర్మిస్తారుమొత్తానికి టౌన్హాలులను ఆధునికరీతిలో నిర్మిస్తూ కళా క్షేత్రంగా రూపొందిస్తారు. మార్కెట్లను ఆధునిక రీతిలో నిర్మిస్తారు. మాంసం మార్కెట్లు స్థలం లభ్యతను బట్టి ఒకేప్రాంగణంలో ఉండేలా చూస్తారు. ప్రత్యేక మార్గాలుకూడా ఏర్పాటు చేస్తారు. పరిశుభ్రతకు పెద్దపీటవేస్తూ మున్సిపాలిటీ సిబ్బందిని నియమిస్తారు. బీఫ్, గొర్రెలు, మేకల స్లాటర్ హౌజ్లను ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఇందు కోసం నిధులనుకేటాయిస్తారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలలో ఈలైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి. లైబ్రరీలోపురాణేతిహాసాలు, కాల్పనిక సాహిత్యంతో పాటుమేదస్సును పెంచే పుస్తకాలను అందుబాటులోఉంచుతారు. పోటీ పరీక్షల విద్యార్థులకుఅవరసరమైన పుస్తకాలను కూడా ఉంచుతారు.
నోటిఫై చేసిన స్లమ్స్లలో బహుళప్రయోజనకారిగా ఉండేలా ఫంక్షన్ హాళ్లనునిర్మిస్తారు. వీటిలో బర్త్డే లాంటి ఫంక్షన్లనునిర్వహించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ఆడపిల్లలపెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్న నేపథ్యంలో పెళ్లి నిర్వహణ కో్సం ప్రత్యేకముగా కళ్యాణ లక్ష్మిప్రాంగణాలు, షాదీ ఖానాలను నిర్మిస్తారు. ఎంపి కవిత ఆలోచనతో ఈ పెళ్లి ప్రాంగణాలుఏర్పాటవుతుండటం విశేషం.
Post Views: 540