Home / ANDHRAPRADESH / వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. 14వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. 14వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని జ‌గ‌న్‌వెంట న‌డుస్తున్నారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 14వ రోజు షెడ్యూల్ ఇలా ఉంది. 14వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములెపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9 గంటలకు షైక్‌షావలీ దర్గాను చేరుకొని డోన్‌ నియోజకవర్గం పార్టీ నేతలతో ముచ్చటించనున్నారు. ఉదయం 10 గంటలకు పాణ్యం నేతలతో మాట్లాడారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 3.3 గంటలకు బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌ లో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి కోలుములెపల్లి చేరుకొని.. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat