Home / SLIDER / వాయుకాలుష్యం త‌గ్గించేందుకు ప్ర‌ణాళిక‌లు…జ‌పాన్ అధికారుల‌తో మంత్రి కేటీఆర్‌

వాయుకాలుష్యం త‌గ్గించేందుకు ప్ర‌ణాళిక‌లు…జ‌పాన్ అధికారుల‌తో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల‌లో ముందుకు తీసుకుపోయేందుకు, అభివృద్ధి- సంక్షేమం అజెండాతో ముందుకు సాగుతున్నామ‌ని  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌ రామారావు తెలిపారు. రాష్ర్టంలోని వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతున్నదని వివ‌రించారు. ఈరోజు మెట్రో రైలు భవన్లో జపాన్ ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలిపిన మంత్రి, వాయు కాలుష్య నివారణలోనూ అధునాతన పద్దతులను అవలభించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ మేరకు ఈ రంగంలో అధ్భుతమైన ప్రగతి సాధించిన జపాన్ అనుభవాలను ఉపయోగించుకునేందుకు రేడీగా ఉన్నామని మంత్రి, జపాన్ ప్రతినిధి బృందానికి తెలిపారు.
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పెద్ద నగరాల్లో ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు, ఇక్కడి పరిస్ధితులను అధ్యయనం చేసి ఒక నివేధిక ఇవ్వాలని వారిని మంత్రి కేటీఆర్‌ కోరారు. చెత్త ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, వేస్ట్ టూ ఎనర్జీ, సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పద్దతులు, స్పాట్ ఇన్సినరేషన్ ప్లాంట్లు ఏర్పాటు వంటి అంశాలపైన జపాన్ సహాకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని అతి కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, అక్కడ నూతనంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో అత్యుత్తమ కాలుష్య నియంత్రణ పద్దతులను అనుసరించనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మసిటీ వంటి ప్రాజెక్టుల్లోనే కాలుష్య నియంత్రణకు చేపడుతున్న అంతర్జాతీయస్ధాయి ప్రమాణాలతో కూడిన పద్దతులను మంత్రి వారికి వివరించారు.
తమ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇప్పటికే వాయు కాలుష్య, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నియంత్రణ పద్దతుల అధ్యాయనానికి జపాన్ లో పర్యటన చేసిందని, తమ ప్రభుత్వ అహ్వానం మేరకు ఇక్కడ పరిస్ధితులను అధ్యయనం చేసేందుకు జపాన్ బృందం ఇక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జపాన్ ఏక్స్ టర్నల్ ట్రేడ్ అర్గనైజేషన్ (జెట్రో), క్లీన్ అథారీటి అప్ టోక్యో ప్రతినిథులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. వీరు బీబి నగర్ పవర్ ప్లాంటు, జవహార్ నగర్ డంప్ యార్డ్ సందర్శించనున్నారు.   తమ పర్యటనలో వీరు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పర్యటించి, ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా సాలిడ్ వేస్ఠ్ మేనేజ్ మెంట్ మరియు వాయు కాలుష్య నియంత్రణ పద్దతులపైన ఒక నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో పురపాలక శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు, సిడియంఏ, ఈ పిటిఈఅర్ఐ అధికారులు పాల్గోన్నారు. జపాన్ ప్రతినిధి బృదం తమ దేశంలో పాటిస్తున్న పద్దతులను సమావేశంలో వివరించారు. ముఖ్యంగా టోక్యో క్లీన్ ఏయిర్ అథారీటీ  అధ్యర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించిన జపాన్ ప్రతినిధి బృందం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్లీన్ ఎయిర్ అథారీటీకి సహాయ సహాకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది.  ఈ సమావేశంలో మంత్రి కే తార‌క‌ రామారావు తోపాటు పురపాలక శాఖ, పిసిబి, ఈపిటిఅర్ఐ అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat