తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జానారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
