తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 28న ఆ సదస్సు ప్రారంభంకానున్నది. శంషాబాద్లోని రాజీవ్గాంధీ విమానాశ్రయానికి బదులుగా ఇవాంకా నేరుగా బేంగపేట విమానాశ్రయంలో దిగనున్నట్లు సమాచారం. అదే రోజున మెట్రో రైలు ప్రారంభోత్సవం కోసం వస్తున్న ప్రధాని మోదీ కూడా బేగంపేట విమానాశ్రయంలోనే దిగే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ రాక సందర్భంగా అడ్వాన్స్డ్ సెక్యూర్టీ లైజనింగ్ టీమ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, డీసీపీ, ఎయిర్పోర్ట్ డైరక్టర్, ఇతరులు భద్రతను సమీక్షించారు. శంషాబాద్లో ఒకే రన్వే ఉన్న కారణంగా ఇవాంకా విమానాన్ని బేగంపేటలో ల్యాండ్ చేయనున్నారు. దీని వల్ల రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో రెగ్యులర్ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉంటుంది.
