మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేసే స్కైవాక్ల నిర్మాణంలో ముందడుగు పడింది.హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో తొలి స్కైవాక్ను ఏర్పాటు చేయబోతున్నారు. తొలి మెట్రో స్కైవాక్ను ఉప్పల్లో ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల సౌలభ్యం కోసం మెట్రోస్టేషన్ నుంచి ఉప్పల్ స్టేడియాన్ని అనుసంధానం చేస్తూ స్కైవాక్ను నిర్మించనున్నామన్నారు. ఇది వరకే హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షులు జి. వివేక్తో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చర్చించారని, ఇది త్వరలోనే సాకారమవుతుందన్నారు.ఇదే తరహాలో ఉప్పల్లో గల ఎన్ఎస్ఎల్ ఐటీ సెజ్ సైతం స్కైవాక్ ఏర్పాటు చేయాలని కోరిందని, ఇందుకయ్యే ఖర్చులో కొంత మేర భరించేందుకు సెజ్ నిర్వాహకులు ముందుకొచ్చారని, వారితోను చర్చలు కొనసాగుతున్నాయన్నారు. దీంతో పాటు సమీపంలోని కమర్షియల్ కాంప్లెక్స్ను సైతం అనుసంధానం చేస్తూ పలు ప్రాంతాల్లో స్కైవాక్ను నిర్మించనున్నామన్నారు.