Home / SLIDER / జీఈఎస్ విష‌యంలో..8 రాష్ర్టాల‌కు రాని చాన్స్ మ‌న‌కెలా ద‌క్కిందో చెప్పిన మంత్రి కేటీఆర్‌

జీఈఎస్ విష‌యంలో..8 రాష్ర్టాల‌కు రాని చాన్స్ మ‌న‌కెలా ద‌క్కిందో చెప్పిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి ద‌క్కిన గౌర‌వం గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోమారు కీల‌క వేదిక‌గా వివ‌రించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ROAD TO GES -GET INTO THE RING సదస్సు లో విద్యార్ధులను ఉదేశించి ప్రసంగించిన  మంత్రి కేటీఆర్ ఈ ంస‌ద‌ర్భంగా కీల‌క అంశం గురించి వివ‌రించారు. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్  నిర్వహించడానికి దేశంలో 8 రాష్ట్రాల్లో పోటీ పడిన‌ప్ప‌టికీ…తెలంగాణ‌కు ఆ అవకాశం ద‌క్కింద‌ని తెలిపారు. ఈ జీఈఎస్‌ సమావేశంలో మహిళ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనున్నారని మంత్రి తెలిపారు.
మూడు రోజుల పాటు అనేక అంశాలు పైన ప్యానల్ డిస్కషన్ ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున  డేలిగేట్స్  వస్తున్నార‌ని మంత్రి వివ‌రించారు. మహిళ పారిశ్రామిక వేత్తలకు ఉపయోగకరంగా ఉంటుందని  వెల్ల‌డించారు.ప్రధాన మంత్రి అనేక అంశాలు పైన ప్రసంగించనున్నారని తెలిపారు. జీఈఎస్ వేదిక‌గా కీల‌క అంశాల‌పై జ‌రిగే ఒప్పందాల‌తో…తెలంగాణ‌కు వైభ‌వం ద‌క్కుతుంద‌ని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat