ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రేపు సాయంత్రం హెచ్ఐసీసీలో ఇవాంక ట్రంప్తో 20 నిమిషాలు భేటీ కానున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ షెడ్యూల్లో ఈ భేటీని కూడా చేర్చారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే
మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. మ. 1.45 గంటలకు హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్ను మోదీ ఆవిష్కరిస్తారు. మ. 2.20 గంటలకు ఆడియో విజువల్ ప్రజంటేషన్, మెట్రో రైల్ యాప్, బ్రోచర్ను విడుదల చేస్తారు. మ. 2.30 నుంచి 2.40 గంటల వరకు మియాపూర్ – కూకట్పల్లి, కూకట్పల్లి – మియాపూర్ మధ్య మెట్రో రైలులో మోదీ ప్రయాణించనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు మియాపూర్ నుంచి హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకుంటారు. అనంతరం మ. 3.35 నుంచి 3.55 గంటల వరకు ఇవాంక ట్రంప్తో మోదీ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సు ముగిసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు రహదారి మార్గంలో ఫలక్నూమా ప్యాలెస్కు ప్రధాని బయల్దేరనున్నారు. రాత్రి 10 గంటల వరకు ఫలక్నూమా ప్యాలెస్లో మోదీ ఉండనున్నారు. రాత్రి 10.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.