Home / ANDHRAPRADESH / నాకు ప్రజలే ముఖ్యం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

నాకు ప్రజలే ముఖ్యం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరోసారి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే శ్రీధరరెడ్డికి పోలీసు భద్రతా విభాగం గన్ మెన్లను కేటాయించింది. అయితే, తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మరో రెండు సార్లు గన్ మెన్లను కేటాయించగా… అప్పుడు కూడా తిప్పి పంపారు.

తాజాగా, నిన్న కూడా ఇద్దరు గన్ మెన్లను పోలీసు విభాగం కేటాయించింది. పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో భద్రత తప్పనిసరి అంటూ పోలీసులు కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని పేర్కొంటూ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి ఆయన లేఖలు రాశారు. తనకు పోలీసు భద్రత అవసరం లేదని, ప్రజలే కొండంత అండ ,నాకు ప్రజలే ముఖ్యం అని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat