ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీమేరకు డిసెంబర్ 3న అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 39మందితో సీఎం కేసీఆర్ సమావేశంకానున్నట్టు సమాచారం. కొత్త పంచాయతీరాజ్ బిల్లు ఆమోదానికి డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పంచాయతీరాజ్ చట్టానికి పదునుపెట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మేరకు చట్టానికి చేయాల్సిన సవరణలపై అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం.
