కోనంపేట పీహెచ్సీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన కేసులో లక్కిరెడ్డిపల్లె కోర్టు వాయిదాకు బుధవారం ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …..ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తా, నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని అయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. రోజుకు 14–16 కిలో మీటర్లు నడుస్తూ వైఎస్ జగన్ సంకల్పయాతల్రో సాగుతున్నారన్నారు.
ప్రజలకు ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో తయారు చేసి, వారికి మేలు చేస్తానన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి పలువురు బయటికి వెళుతున్నారంటూ దొంగచాటుగా మీడియాలో ప్రచారం చేస్తూ.. అందులో తన పేరు కూడా చేర్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. శ్రీకాంత్రెడ్డిని సంప్రదించానని ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.