టీఆర్టీ దరఖాస్తు గడువును పొడిగించారు. డిసెంబర్ 15 వరకు టీఆర్టీ గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదలు చేసింది. వాస్తవానికి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో టీఆర్టీ గడువును పొడిగించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును పెంచినట్లు టీఎస్పీఎస్సీ ఆ ప్రకటనలో పేర్కొన్నది.
