ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ…
తెలంగాణలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, నెలకు రూ.1500 లు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. మామిడిపల్లిలో 10 ఎకరాల స్థలంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచామని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలులోనూ దివ్యాంగుల కోసం వ్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, సినీ నటి జీవిత తదితరులు పాల్గొన్నారు.